పోస్టల్ బ్యాలెట్లో మంచు విష్ణు ప్యానెల్ ముందంజ
ABN , First Publish Date - 2021-10-10T23:46:43+05:30 IST
మా ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో...
హైదరాబాద్: ‘మా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. పోలైన ఓట్లలో 50 చెల్లనివిగా ఈసీ నిర్ధారించారు. 6 టేబుల్స్పై కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. మురళీ మోహన్, మోహన్ బాబు సమక్షంలో కౌంటింగ్ సాగుతోంది. ఇక గెలుపుపై ఎవరికివారు ధీమాగా ఉన్నారు. ప్రధానంగా ప్రకాశ్ రాజ్, మంచి విష్ణు ప్యానళ్ల మధ్య పోటీ నెలకొంది