ఒకటి నుంచి అంగన్వాడీల్లో మధ్యాహ్న భోజనం

ABN , First Publish Date - 2022-06-28T05:41:54+05:30 IST

అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభం కానుంది.

ఒకటి నుంచి అంగన్వాడీల్లో మధ్యాహ్న భోజనం

ఒంగోలునగరం, జూన్‌ 27: అంగన్వాడీ కేంద్రాల్లో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి మధ్యాహ్న భోజనం తిరిగి ప్రారంభం కానుంది. కరోనాతో రెండేళ్ల క్రితం రాష్ట్రప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనాన్ని నిలిపివేసింది.  అప్పటినుంచి పోషకాహార పదార్థాలను లబ్ధిదారులకు ఇంటికే అందజేస్తున్నారు. దీని వలన పౌష్టికాహారం ఇతరులు తినే అవకాశం ఉండటంతో లక్ష్యం నెరవేరదనే అభిప్రాయంతో తిరిగి మధ్యాహ్నభోజనాన్ని జూలై ఒకటో తేదీ నుంచి అంగన్వాడీల్లో అందజేయాలని నిర్ణయించారు. కేంద్రాల్లో ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు ఈ భోజనం వండిపెడతారు. జిల్లాలో 25,257 మంది గర్భిణులు, 22,463మంది బాలింతలు, 6 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 1,03,580మంది, 3 నుంచి ఆరేళ్లలోపు వయస్సు పిల్లలు 73,404 మంది ఉన్నారు.


Updated Date - 2022-06-28T05:41:54+05:30 IST