యువ‌కుణ్ణి తుపాకీతో కాల్చి చంపి స్టేష‌న్‌లో లొంగిపోయిన కానిస్టేబుల్‌

ABN , First Publish Date - 2021-06-10T11:15:16+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో...

యువ‌కుణ్ణి తుపాకీతో కాల్చి చంపి స్టేష‌న్‌లో లొంగిపోయిన కానిస్టేబుల్‌

లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక పోలీసు కానిస్టేబుల్ యువకుడిని తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన విభూతిఖండ్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలోని లోహియాలో చోటుచేసుకుంది. ఈ ఉదంతం స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఆశిష్ మిశ్రా అనే కానిస్టేబుల్ బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ప్రవీణ్ అనే యువకుడి తలపై తుపాకీతో షూట్ చేసిన అనంత‌రం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. 


సమాచారం అందుకున్న డీసీపీ, ఏసీపీ, ఇన్‌స్పెక్టర్ సహా పలువురు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచార‌ణ చేప‌ట్టారు. లక్నో పోలీస్ కమిషనర్ డికె ఠాకూర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం హత్యకు దారితీసిన కార‌ణాలు ఇంకా వెల్ల‌డికాలేదు. అయితే ప్రవీణ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని, అందుకే అతన్ని కాల్చి చంపినట్లు నిందితుడు పోలీసుల‌ విచారణలో చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బదౌన్ జిల్లా నివాసి ఆశిష్ మిశ్రా 2016 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ప్రస్తుతం సితాపూర్‌లో ప‌నిచేస్తున్నాడు.

Updated Date - 2021-06-10T11:15:16+05:30 IST