తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్థులకు 10 అదనపు మార్కులు

ABN , First Publish Date - 2022-02-23T14:03:04+05:30 IST

తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్థులకు 10 అదనపు మార్కులు ఇస్తామని లక్నో కళాశాల ప్రకటించింది...

తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్థులకు 10 అదనపు మార్కులు

లక్నో కళాశాల ప్రిన్సిపాల్ బంపర్ ఆఫర్

లక్నో (ఉత్తరప్రదేశ్): తల్లిదండ్రులు ఓటు వేస్తే విద్యార్థులకు 10 అదనపు మార్కులు ఇస్తామని లక్నో కళాశాల ప్రకటించింది. లక్నోలోని క్రైస్ట్ చర్చి కాలేజీ ప్రస్తుతం జరుగుతున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేసిన విద్యార్థులకు 10 మార్కులను బహుమతిగా ఇస్తామని హామీ ఇచ్చింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగు శాతాన్ని పెంచేందుకు కళాశాల విద్యార్థులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఓటర్ల సంఖ్యను పెంచడంతోపాటు బలహీన విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు ఈ చర్య తీసుకున్నట్లు లక్నోలోని క్రైస్ట్ చర్చ్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాకేష్ కుమార్ పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన బంపర్ ఆఫరుతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఓటు వేసేలా ప్రోత్సహిస్తారని కళాశాల అధ్యాపకులు చెప్పారు. 


Updated Date - 2022-02-23T14:03:04+05:30 IST