Tokyo Olympics: లవ్లీనా ఓటమి.. భారత్ ఖాతాలో మూడో పతకం
ABN , First Publish Date - 2021-08-04T17:54:17+05:30 IST
భారత యువ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ సెమీస్లో ఓటమి చవిచూసింది.
టోక్యో: భారత యువ బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్ సెమీస్లో ఓటమి చవిచూసింది. మహిళల 69 కిలోల విభాగంలో టర్కీకి చెందిన ప్రత్యర్థి సుర్మెనెలి చేతిలో 5-0 తేడాతో పరాజయం పాలైంది. దీంతో లవ్లీనా కాంస్యంతో సరిపెట్టుకుంది. భారత్ ఖాతాలో మూడో పతకం చేరింది. అటు లవ్లీనా బాక్సింగ్లో భారత్కు పతకం అందించిన మూడో బాక్సర్గా చరిత్ర సృష్టించింది. మేరీ కోమ్, విజేందర్ సింగ్ తర్వాత భారత్కు పతకం అందించిన మూడో బాక్సర్ లవ్లీనా. 2008లో విజేందర్, 2012లో మేరీకోమ్ భారత్కు ఒలింపిక్స్ పతకాలు అందించిన విషయం తెలిసిందే. ఇక బాక్సింగ్ విభాగంలో భారత్కు లవ్లీనా 12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్లో పతకాన్ని అందించడం విశేషం. దీంతో అభిమానులు ఆమె సాధించిన కాంస్యాన్ని కూడా స్వర్ణంతో సమానం అని ప్రశంసిస్తున్నారు.