Marriage: పొదల చాటున కూర్చున్న ప్రేమ జంటను పట్టుకున్న స్థానికులు.. రక్తంతో అమ్మాయికి బొట్టు పెట్టిన అబ్బాయి.. చివరకు..
ABN , First Publish Date - 2022-08-29T02:06:08+05:30 IST
ఆ అబ్బాయి రెండేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.. ఇద్దరూ తరచుగా సినిమాలకు, పార్కులకు వెళుతుండేవారు.
ఆ అబ్బాయి రెండేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు.. ఇద్దరూ తరచుగా సినిమాలకు, పార్కులకు వెళుతుండేవారు.. ఈ నెల 21వ తేదీన తమకు దగ్గర్లో ఉన్న ఓ టూరిస్ట్ స్పాట్కు వెళ్లారు.. అక్కడ పొదల్లో కూర్చుని రొమాన్స్ సాగిస్తున్నారు.. వారి చర్యలను గమనించిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇద్దరినీ పట్టుకుని బలవంతంగా పెళ్లి చేశారు.. అబ్బాయి వేలు కోసి ఆ రక్తంతో అమ్మాయి నుదుటిన బొట్టు పెట్టించారు.. ఆ ఘటనను వీడియో తీసి వైరల్ చేశారు.. చివరకు ఆ వీడియో ఆ యువతీయువకులు తల్లిదండ్రులకు చేరింది.. వారు చేసేది లేక ఇద్దరి పెళ్లికీ అంగీకరించారు.
ఇది కూడా చదవండి..
ఓ నిరుపేద కూలీకి సడన్గా లగ్జరీ లైఫ్.. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!
బీహార్ (Bihar)లోని ముంగేర్ జిల్లాకు చెందిన మిథ్లేష్ కుమార్ అనే యువకుడు రెండేళ్లుగా ఓ యువతితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. ఆ యువతితో కలిసి తరచుగా బయటకు వెళ్తుండేవాడు. ఈ నెల 21న తన ప్రియురాలితో కలిసి ఖరగ్పూర్ సరస్సు చూసేందుకు వెళ్లాడు. అక్కడ కొద్ది సేపు గడిపిన అనంతరం ఇద్దరూ కలిసి పొదల చాటుకు వెళ్లారు. వారి రొమాన్స్ను చూసిన స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తి చేసి వారిపై దాడికి దిగారు. వారిద్దరికీ బలవంతంగా పెళ్లి చేశారు.
యువకుడి వేలు కోయగా వచ్చిన రక్తంతో యువతి నుదుటిపై బొట్టు పెట్టించారు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీసి వైరల్ చేశారు. ఆ వీడియో చివరకు ఆ యువతీ యువకుల తల్లిదండ్రులకు చేరింది. ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుని ఇద్దరికీ చట్టబద్ధంగా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు.