ప్రియుడిని సోదరుడిగా భర్తకు పరిచయం చేసింది.. చివరకు వారిద్దరూ కలిసి ఎంత పని చేశారంటే..

ABN , First Publish Date - 2022-04-19T19:54:06+05:30 IST

ఆమె ఓ వివాహితుడితో ప్రేమలో పడింది.. అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది..

ప్రియుడిని సోదరుడిగా భర్తకు పరిచయం చేసింది.. చివరకు వారిద్దరూ కలిసి ఎంత పని చేశారంటే..

ఆమె ఓ వివాహితుడితో ప్రేమలో పడింది.. అతనితో శారీరక సంబంధం పెట్టుకుంది.. విషయం తెలుసుకున్న పెద్దలు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు.. పెళ్లి తర్వాత కూడా ఆమె తీరు మారలేదు.. ప్రియుడిని తన సోదరుడిగా భర్తకు పరిచయం చేసింది.. ప్రియుడు తరచుగా ఆమె ఇంటికి వెళ్లేవాడు.. చివరకు ఒకరోజు ఆమె తన ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది.. ఎవరూ అనుమానించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.. అయినా పోలీసులకు దొరికిపోయారు. 


మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లోని దౌరియా గ్రామానికి చెందిన రుబీనా అనే మహిళ తన పక్కింట్లో ఉండే జితేంద్ర కుష్వాహతో చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తోంది. జితేంద్ర అప్పటికే వివాహితుడు. విషయం రుబీనా తల్లిదండ్రులకు తెలిసింది. వారు వెంటనే రుబీనాకు తికమ్‌ఘర్ జిల్లా పత్తారం గ్రామానికి చెందిన జావేద్‌తో పెళ్లి చేసేశారు. వివాహం జరిగిన నెల రోజుల తర్వాత జితేంద్ర.. రుబీనా ఇంటికి వెళ్లాడు. జితేంద్రను రుబీనా తన సోదరుడిగా భర్తకు పరిచయం చేసింది. దీంతో జితేంద్ర తరచుగా రుబీనా ఇంటికి వెళ్లి అక్కడే రొమాన్స్ చేసేవాడు. వీరిద్దరి వ్యవహారంపై జావేద్‌కు అనుమానం వచ్చింది. దాంతో అతడిని చంపాలని నిర్ణయించుకున్నారు. 


పథకం ప్రకారం రుబీనా పుట్టింటికి వెళ్లిపోయిన తర్వాత జావేద్‌ను జితేంద్ర ఆల్కహాల్ సేవించేందుకు ఆహ్వానించాడు. మద్యం సేవించిన తర్వాత జావేద్‌ను తుపాకీతో కాల్చి గ్రామ శివారుల్లో గొయ్యి తీసి పూడ్చేశాడు. జావేద్ హఠాత్తుగా అదృశ్యం కావడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రుబీనా సోదరుడితో జావేద్ వెళ్లినట్టు తెలుసుకున్నారు. విచారణలో అతను రుబీనా సోదరుడు కాదు.. ప్రియుడు అని తెలుసుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో రుబీనా, జితేంద్రను అరెస్ట్ చేశారు. 


Updated Date - 2022-04-19T19:54:06+05:30 IST