ఒకే కులం.. ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ పెళ్లికి రెడీ అవుతున్న వీళ్లిద్దరి జీవితాలు రాత్రికి రాత్రే మిస్టరీగా మారాయిలా..!

ABN , First Publish Date - 2021-09-18T16:52:50+05:30 IST

వారిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఇద్దరిదీ ఒకే కులం.

ఒకే కులం.. ఆరేళ్లుగా ప్రేమించుకుంటూ పెళ్లికి రెడీ అవుతున్న వీళ్లిద్దరి జీవితాలు రాత్రికి రాత్రే మిస్టరీగా మారాయిలా..!

వారిద్దరూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. ఇద్దరిదీ ఒకే కులం.. అమ్మాయి తరఫు వారి ఈ పెళ్లికి అంగీకరించలేదు.. అయినా వారిద్దరూ పెళ్లికి సిద్ధమయ్యారు.. ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు.. అయితే కలిసి జీవించాలన్న వారి కలలు నిజం కాలేదు.. ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.. ఉత్తరప్రదేశ్‌లో షాజాపూర్‌లో ఈ ఘటన జరిగింది. 


నోగవాన్ నిరోత్తం గ్రామానికి చెందిన ఆశిష్ కుమార్, అదే గ్రామానికి చెందిన కృష్ణపాల్ సింగ్ కుమార్తె బంటీ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరిదీ ఒకే కులం అయినప్పటికీ అమ్మాయి తరఫు వారు ఈ పెళ్లికి అంగీకరించలేదు. అయినా ఆమె తన తల్లిదండ్రులను ఎదురించి పెళ్లికి సిద్ధమైంది. పెళ్లికి రోజులు దగ్గరపడుతున్న తరుణంలో శుక్రవారం ఉదయం ఈ ఇద్దరూ విగత జీవులుగా మారిపోయారు. ఇద్దరినీ ఎవరో కాల్చి చంపేశారు. ఆశిష్ మృతదేహం గ్రామం వెలుపల లభించగా.. బంటి తన ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉంది. 


ఇవి కూడా చదవండి

అఫ్ఘానిస్తాన్ దెబ్బకు అమాంతం పెరిగిన కుంకుమ పువ్వు ధర



అదే జరిగితే లీటర్ పెట్రోల్ ధర 57 రూపాయలు మాత్రమే..!




ఇద్దరినీ తుపాకీతో కాల్చి చంపినట్టు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. ఈ రెండు హత్యలూ కృష్ణపాల్ సింగ్ చేశాడని, ఆశిష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్థికంగా దిగువ స్థానంలో ఉన్న తమ ఇంటికి కూతురిని కోడలిగా పంపడం ఇష్టం లేకే కృష్ణపాల్ ఇంతటి ఘాతుకానికి తెగించాడని పేర్కొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్ట్‌మ్ కోసం తరలించారు. కృష్ణపాల్ సింగ్‌ను, అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.  

Updated Date - 2021-09-18T16:52:50+05:30 IST