ప్రియుడితో కలిసి సైనికుడైన భర్తను చంపిన భార్య

ABN , First Publish Date - 2020-02-24T16:48:27+05:30 IST

ప్రియుడితో కలసి ఏకంగా సైనికుడైన భర్తను దారుణంగా హతమార్చి పోలీసులకు పట్టుబడి భార్య ఉదంతం

ప్రియుడితో కలిసి సైనికుడైన భర్తను చంపిన భార్య

బెంగళూరు : ప్రియుడితో కలసి ఏకంగా సైనికుడైన భర్తను దారుణంగా హతమార్చి పోలీసులకు పట్టుబడి భార్య ఉదంతం బెళగావిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సైనికుడు దీపక్‌, భార్య అంజలితో కలసి బెళగావి తాలూకా మారిహాల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించేవారు. సైనికుడు దీపక్‌, భార్య అంజలికోసం ఓ కా రును కొనుగోలు చేసి ఇచ్చారు. కారు డ్రైవర్‌ గా చేరిన ప్రశాంత్‌, అంజలితో స్నేహం పెం చుకున్నారు. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీపక్‌ భార్యను ఇదే విషయమై మందలించారు. అయినా ఇరువురి మఽ ద్యా సంబంధం కొనసాగింది. విధులనుంచి వచ్చిన దీపక్‌ను హతమార్చాలని భార్య, ప్రియుడు కుట్రపన్నారు. 


దీపక్‌ను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి అంజలి, ప్రియుడు ప్రశాంత్‌ అతడి మిత్రుడు నవీన్‌, ప్రవీణ్‌లు కలసి దారుణంగా హత్య చే శారు. ఏమీ తెలియనట్టుగా అంజలి పోలీస్‌ స్టేషన్‌లో తన భర్త కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులు అంజలి మొబైల్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తే ప్రశాంత్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇరువురిని ప్రశ్నించగా అ సలు విషయాన్ని అంగీకరించారు. ఈమేరకు ఆదివారం అంజలి, ప్రశాంత్‌లను అరెస్టు చే సిన పోలీసులు మరో ఇరువురికోసం గాలింపులు ప్రారంభించారు. 

Updated Date - 2020-02-24T16:48:27+05:30 IST