ప్రేమ పేరుతో యువకుడి మోసం.. పెళ్లికి నో చెప్పడంతో యువతి ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-08-06T18:41:29+05:30 IST
చేర్యాల పట్టణంలోని యాదవనగర్ కాలనీకి చెందిన కందూరు సరిత(19) బుధవారం క్రిమి సంహారక మందును తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
చేర్యాలలో యువతి ఆత్మహత్య
చేర్యాల (మెదక్): చేర్యాల పట్టణంలోని యాదవనగర్ కాలనీకి చెందిన కందూరు సరిత(19) బుధవారం క్రిమి సంహారక మందును తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సరిత తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కడవేరుగు గ్రామానికి చెందిన బాగోతం నరేశ్ ప్రేమ పేరిట సరితను నమ్మించి, లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని సరిత కోరడంతో ముఖం చాటేశాడు. దీంతో మనస్తాపానికి గురైన సరిత.. ఇంట్లో ఎవరూలేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స నిమిత్తం చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. మృతదేహానికి చేర్యాల మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించారు.