ఒక Loverతో మరో ప్రియుడిని మర్డర్ చేయించిన వీడియో వైరల్
ABN , First Publish Date - 2022-05-14T12:04:31+05:30 IST
ఒక Loverతో మరో ప్రియుడిని మర్డర్ చేయించిన వీడియో వైరల్
- హత్య చేసి.. సపర్యలు చేసినట్లు నటించి..
హైదరాబాద్ సిటీ/సైదాబాద్ : ఒక ప్రియుడితో మరో ప్రియుడిని హత్య చేయించిన వివాహిత కేసులో మర్డర్ ప్లాన్ వీడియో వైరల్గా మారింది. హత్య చేసిన నిందితులు అనంతరం రోడ్డు యాక్సిడెంట్గా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన దృశ్యాలు సీసీ ఫుటేజీల్లో నిక్షిప్తం అయ్యాయి. వివాహిత శ్వేతారెడ్డి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఇద్దరితో ప్రేమాయణం సాగించింది. ఓ స్నేహితుడు యశ్మకుమార్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతడితో న్యూడ్ కాల్స్ మాట్లాడేది. వాటిని అడ్డం పెట్టుకుని తనను పెళ్లి చేసుకోవాలని యశ్మకుమార్ బ్లాక్ మెయిల్ చేసేవాడు. దీంతో అతడిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది. మరో ఫేస్బుక్ స్నేహితుడు అశోక్కు విషయం చెప్పింది.
ఆ సమయంలో కొన్ని వాహనాలు అటువైపుగా రావడం గమనించిన నిందితులు ప్రమాదం బారిన పడ్డ యువకుడికి సపర్యలు చేస్తున్నట్లుగా నటించారు. జనం గుమిగూడడంతో అక్కడే ఉంటే ప్రమాదం అని భావించి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. ఆ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజీల్లో నిక్షిప్తం అయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో వైరల్గా మారింది.
ప్రియురాలి కోరిక మేరకు మరో స్నేహితుడి సహాయంతో యశ్మకుమార్ను చంపాలని అశోక్ నిర్ణయించుకున్నాడు. యశ్మకుమార్కు ఫోన్ చేసిన శ్వేత నందిహిల్స్కు రావాలని చెప్పింది. అక్కడకు వచ్చి ఆమె కోసం బండిపై వేచి ఉన్న యశ్మకుమార్ను సుత్తితో తీవ్రంగా కొట్టారు నిందితులు. అనంతరం రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. యశ్మకుమార్ను రోడ్డుపై పడేశారు.
చంచల్గూడ మహిళా జైలులో..
నిందితురాలు శ్వేతారెడ్డి ప్రస్తుతం చంచల్గూడ మహిళా జైలులో కటకటాలు లెక్కిస్తోంది. ఇతర ఖైదీలతో మాట్లాడకుండా ముభావంగా ఉన్నట్లు సమాచారం. ములాఖత్లో శ్వేతారెడ్డిని కలిసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె గర్భవతి అని, ప్రత్యేక జాగ్రత్తలు అవసరమని జైలు అధికారులను కోరినట్లు వివరించారు.