HYD : కొంతకాలంగా మహిళతో సహజీవనం.. తనతోనే ఉండిపోవాలని గొడవ.. చివరికి ఘోరం..!

ABN , First Publish Date - 2021-12-23T12:17:21+05:30 IST

కొంతకాలంగా మహిళతో సహజీవనం.. తనతోనే ఉండిపోవాలని గొడవ.. చివరికి ఘోరం..!

HYD : కొంతకాలంగా మహిళతో సహజీవనం.. తనతోనే ఉండిపోవాలని గొడవ.. చివరికి ఘోరం..!

హైదరాబాద్ సిటీ/కేపీహెచ్‌బీ : తనతో సహజీవనం చేయడం లేదనే ఆగ్రహంతో ఓ మహిళపై పెట్రోల్‌ పోసి హత్య చేసిన సంఘటన బుధవారం కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. కూకట్‌పల్లి సీఐ నర్సింగరావు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన మహిళ(50), ఇద్దరు పిల్లలతో జగద్గిరిగుట్లలో నివాసముండేది. ఆమెకు కడపకు చెందిన వెంకటేశ్వర్లు (55)తో కొన్నేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరు కొంతకాలంగా సహజీవనం చేశారు. ఆమె స్థానికులతో మాట్లాడితే అనుమానించి వేధించేవాడు. వేధింపులు భరించలేక ఆమె కూకట్‌పల్లి ప్రకాష్‌నగర్‌లోని ఓ ఇంటికి మారింది. వెంకటేష్‌ ఆమె నివసిస్తున్న చోటుకు వచ్చి తనతో కలిసి ఉండాలని వేధించసాగాడు.


ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. బుధవారం రాత్రి ఇంట్లో ఒంటిరిగా ఉన్న సమయంలో ఆ మహిళపై పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ఆమె మృతి చెందింది. మంటలు వెంకటేశ్వర్లుకూ అంటుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఇంట్లోంచి పెద్ద ఎత్తున మంటలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, తలుపులు పగలు కొట్టి అతడిని సమీప అస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-23T12:17:21+05:30 IST