ప్రియుడి జల్సాల కోసం ఆమె చేసిన పని ఏంటో తెలిస్తే...

ABN , First Publish Date - 2022-02-22T17:59:17+05:30 IST

తమిళనాడు పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికైన ఓ యువతి తన ప్రియుడి జల్సాలకు డబ్బు సమకూర్చేందుకు చోరీలకు పాల్పడి ఇపుడు పోలీసులకు చిక్కింది. ఈ వివరాలను పరిశీలిస్తే, విల్లుపురం జిల్లా సెం

ప్రియుడి జల్సాల కోసం ఆమె చేసిన పని ఏంటో తెలిస్తే...

              - పోలీసు ఉద్యోగానికి ఎంపికై చోరీ కేసులో పట్టుబడిన యువతి..! 


అడయార్‌(చెన్నై): తమిళనాడు పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికైన ఓ యువతి తన ప్రియుడి జల్సాలకు డబ్బు సమకూర్చేందుకు చోరీలకు పాల్పడి ఇపుడు పోలీసులకు చిక్కింది. ఈ వివరాలను పరిశీలిస్తే, విల్లుపురం జిల్లా సెంజి ఆలంపూండి గ్రామానికి చెందిన మాధవి (42)  పుదుచ్చేరిలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఈమె పుదుచ్చేరి టీఆర్‌ నగర్‌లోని లేడీస్‌ హాస్టల్‌ ఉంటూ ప్రతి రోజు విధులకు హాజరవుతున్నారు. అయితే, ఈ నెల 18వ తేదీ తన బంధువుల ఇంట జరిగిన వివాహానికి 12 సవర్ల నగలు వెసుకుని వెళ్ళి వచ్చి, మరుసటి రోజు ఆ నగలను తన గదిలోని లాకర్‌లో భద్రపరిచి విధులకు వెళ్ళారు. సాయంత్రం వచ్చి చూడగా నగలు కనిపించకపోవడంతో ఉరులైయన్‌ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా, మాధవి గది పక్కనే ఉండే శివప్రతీక (21) అనే యువతి ప్రవరనపై సందేహించి ఆమెను విచారించారు. ఆమె గదిలో గాలించి పది సవర్ల  నగలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన రెండు సవర్ల నగలను విక్రయించగా వచ్చిన డబ్బును తన ప్రియుడితో కలిసి జల్సాలకు ఖర్చు చేసింది. దీంతో ఆమెపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విచారణలో శివప్రతిక తమిళనాడు పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికైనట్టు తెలిసింది. అంతేకాకుండా, పుదుచ్చేరి పోలీస్‌ శాఖ నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులై ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. ఈ యువతి ఒక యువకుడిని ప్రేమించగా, ఆ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. దీంతో తల్లిదండ్రులను వదిలి వచ్చిన ఈ యువతి లేడీస్‌ హాస్టల్‌లో ఉంటూ పోలీస్‌ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ, చోరీ కేసులో పట్టుబడటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

Updated Date - 2022-02-22T17:59:17+05:30 IST