వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలు అడ్డుపడటంతో.. కఠిన నిర్ణయం తీసుకున్నారు.. కానీ విధి విడదీసింది.. కన్నీరు పెట్టిస్తున్న ప్రేమగాథ

ABN , First Publish Date - 2021-11-06T17:40:45+05:30 IST

యువతీ యువకుల మధ్య చిగురించిన ప్రేమ..

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలు అడ్డుపడటంతో.. కఠిన నిర్ణయం తీసుకున్నారు.. కానీ విధి విడదీసింది.. కన్నీరు పెట్టిస్తున్న ప్రేమగాథ

యువతీ యువకుల మధ్య చిగురించిన ప్రేమ ఎంతో అందంగా కనిపిస్తుంది. అది పెళ్లి వరకూ వెళితే సంతోషమే.. కానీ మధ్యలో ముగిసిపోతేనే తీరని విషాదం. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ్‌లో పరిధిలోని కైలాష్ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక ప్రేమ జంట వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియురాలు సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, ప్రియుడు తీవ్రగాయాపాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 


సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత యువకుడిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అలాగే ఆ యువతి మృతదేహాన్ని పోస్టుమార్టంనకు తరలించారు. అమ్రోహ్ డేహాద్ పోలీస్ స్టేషన్ అధికారి సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న యువకుని వద్ద లభించిన ఫోను నంబరు ఆధారంగా వారిరువురినీ గుర్తించామన్నారు. ఆ యువకుడిని పంజాబ్‌లోని ఫరీదాబాద్ పరిధిలోగల శిర్సానీ నివాసి ఆకాశ్ దీప్ గా గుర్తించామని, ఆ యువతిని ప్రభాజోత్‌గా గుర్తించామన్నారు. వీరిద్దరూ హరియాణాలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ ప్రేమలో పడ్డారని అన్నారు. వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకించడంతో రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించారన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 



Updated Date - 2021-11-06T17:40:45+05:30 IST