గర్ల్ఫ్రెండ్తో లివ్ఇన్.. ఖర్చులు పెరిగిపోవడంతో ఆ కుర్రాడు ఏం చేశాడంటే..
ABN , First Publish Date - 2022-06-19T15:34:40+05:30 IST
జార్ఖండ్లోని ఖుంతీలో గర్ల్ఫ్రెండ్తో లివ్ఇన్ రిలేషన్షిప్లో...
జార్ఖండ్లోని ఖుంతీలో గర్ల్ఫ్రెండ్తో లివ్ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్న ఒక యువకునికి ఖర్చులు పెరిగిపోవడంతో దొంగ అవతారం ఎత్తాడు. వాహనాలను దొంగిలించి, వాటిని విక్రయించడం మొదలుపెట్టాడు. ఆ యువకుని ఇంటి దగ్గర పలు బైక్లు, స్కూటీలు ఉండటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చోరీకి గురైన బైక్, స్కూటీల నంబర్ ప్లేట్లను మార్చి దట్టమైన అడవుల్లో దాచేవాడు. వాటిని విక్రయించి కస్టమర్లకు డెలివరీ చేసేవాడు.
ప్రస్తుతం పోలీసులు రాజు అనే ఈ యువకుడిని విచారించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ బైక్ దొంగల ముఠా గుట్టును ఖుంటి ఎస్పీ అమన్ కుమార్ వెల్లడించారు. వాహనాల దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు ఒక బృందంగా ఏర్పడి దర్యాప్తు ప్రారంభించారు. చుక్రు మలుపు దగ్గర దొంగిలించిన బైక్లను తీసుకెళ్తున్న దొంగలు పోలీసుల కంటపడ్డారు. బైక్కు సంబంధించిన డాక్యుమెంట్లు అడగడంతో వారు పేపర్లు చూపించలేక పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో నిందితులందరూ బైక్ చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. తాము దొంగిలించిన వాహనాలను అడవిలోని పొదల్లో దాచడానికి వెళ్తున్నామని చెప్పారు. వీరికి రాజు అనే యువకుడు నాయకత్వం వహిస్తున్నాడని వెల్లడయ్యింది. అతను గర్ల్ ఫ్రెండ్ తో లివ్ఇన్ లో ఉన్నాడని, జల్సాలకు అలవాటు పడి ఈ పనులు చేస్తున్నాడని విచారణలో తేలింది.