ప్రేమ పేరుతో వంచన
ABN , First Publish Date - 2022-08-13T06:35:50+05:30 IST
ప్రేమ పేరుతో నర్సును వంచించాడు ఓ వైద్యుడు.
పెళ్లి చేసుకుంటానంటూ నర్సుపై వైద్యుడి లైంగిక దాడి
హిమాయత్నగర్, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ప్రేమ పేరుతో నర్సును వంచించాడు ఓ వైద్యుడు. రాంనగర్కు చెందిన కోటం సందీప్ భరద్వాజ్(34) డాక్టర్. హిమాయత్నగర్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మూడేళ్ల నుంచి పనిచేస్తున్నాడు. అదే ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న యువతితో సన్నిహితంగా ఉంటూ ప్రేమపేరుతో దగ్గరయ్యాడు. కులాలు వేరు కావడంతో యువతి నిరాకరించింది. తనకు కులం పట్టింపులు లేవని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రెండేళ్ల క్రితం ఆస్పత్రిలో ఎవరూ లేని సమయంలో ఆమెను తన గదికి పిలిపించుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. యువతికి రక్తస్రావం కావడంతో దోమల్గూడలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించాడు. తర్వాత పలుమార్లు గాంధీనగర్లో తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో భరద్వాజ్ దాటవేస్తున్నాడు. రెండేళ్ల క్రితం ఆమె ఉద్యోగం మానేసి తన స్వగ్రామం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా వెళ్లిపోయింది. మధ్యలో ఒకసారి ఆమెను తన వద్దకు పిలిపించాడు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా భరద్వాజ్ దాటవేస్తుండడంతో నిలదీసింది. గత నెలలో యువతి స్వగ్రామంవెళ్లి.. పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించడం లేదని చెప్పాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
పెళ్లి చేసుకుంటానని మోసం
పంజాగుట్ట, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): పెళ్లి చేసుకుంటానని మహిళను నమ్మించి మోసం చేసి కనిపించకుండాపోయాడు ఓ వ్యక్తి. బంజారాహిల్స్కు చెందిన ఓ మహిళ మెహిదీపట్నంలో నివసిస్తోంది. ఆరాంఘర్లో ఓ ఫంక్షన్ హాల్లో హౌస్కీపింగ్ విభాగంలో పనిచేస్తోంది. ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహం అయింది. భార్యాభర్తలు వేర్వేరుగా ఉంటున్నారు. అదే ఫంక్షన్ హాల్లో సూపర్వైజర్గా పనిచేస్తున్న వ్యక్తితో ఆమెకు పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని అతడు చెప్పగా అంగీకరించింది. ఓ రోజు ప్యారడైజ్ ప్రాంతంలో లాడ్జికి తీసుకెళ్లాడు. విషయం తెలిసి భర్త ఆమెను వదిలేశాడు. సూపర్వైజర్ ఆమెను పట్టించుకోవడం మానేశాడు. ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వస్తోంది. మోససోయానని గ్రహించిన బాధితురాలు పంజాగుట్ట పీఎ్సలో ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నారు.