భర్త వదిలివేయడంతో మరిది ప్రేమలో పడిన వదిన.. పెళ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న మరిది!
ABN , First Publish Date - 2021-10-13T15:37:50+05:30 IST
ప్రేమ పేరుతో మోసపోతున్న మహిళల సంఖ్య..
ప్రేమ పేరుతో మోసపోతున్న మహిళల సంఖ్య దేశంలో అధికంగానే ఉంటుంది. ఈ కోవలోకి వచ్చే ఘటనే ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. మురాదాబాద్లో ప్రియురాలిని హత్యచేసి పరారైన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, జైలుకు తరలించారు. ఈ ఘటన ఛజలత్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతంలో రెండు రోజుల క్రితం ఒక మహిళ మృతదేహం పొలంలో పాతిపెట్టిన స్థితిలో కనిపించింది. గ్రామస్తులు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని వెలికితీసి, పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసు గురించి పోలీసులు మాట్లాడుతూ మృతురాలిని ఉత్తరాఖండ్లోని రుద్రపూర్కు చెందిన ఆశాదేవిగా గుర్తించామన్నారు. ఆమెకు మురాదాబాద్కు చెందిన గజరాజ్తో వివాహమయ్యింది. అయితే 18 ఏళ్ల క్రితమే ఆమెను గజరాజ్ విడిచిపెట్టేశాడు. ఆ తరువాత గజరాజ్కు వరుసకు సోదరుడైన సత్పాల్, ఆశాదేవి ప్రేమించుకుని కలిసివుండసాగారు. అయితే ఆశాదేవి తనను వివాహం చేసుకోవాలంటూ సత్పాల్పై ఒత్తిడి తీసుకురాసాగింది. అలాగే సత్పాల్ పేరిట ఉన్న భూమిని తన పేరుమీద రాయాలని డిమాండ్ చేసింది. ఈ నేపధ్యంలో సత్పాల్ తన ప్రియురాలు ఆశాదేవిని హత్యచేసి, శవాన్ని పొలాల మధ్యలో పాతిపెట్టాడు. ఆశాదేవి కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సత్పాల్పై కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. పోలీసుల విచారణలో సత్పాల్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. సత్పాల్ ఆమెను హత్య చేసేందుకు వాడిన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.