ప్రేమించాడని కళ్లు పొడిచిన కిరాతకులు

ABN , First Publish Date - 2022-02-26T18:46:36+05:30 IST

ప్రేమించిన పాపానికి ఏకంగా ఓ యువకుడి కళ్లను లేకుండా చేసిన కిరాతకులు దుర్మార్గం బెంగళూరు నగరం హుళిమావు ప్రాంతంలో చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చరణ్‌ అనే యువకుడి

ప్రేమించాడని కళ్లు పొడిచిన కిరాతకులు

బెంగళూరు: ప్రేమించిన పాపానికి ఏకంగా ఓ యువకుడి కళ్లను లేకుండా చేసిన కిరాతకులు దుర్మార్గం బెంగళూరు నగరం హుళిమావు ప్రాంతంలో చోటుచేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చరణ్‌ అనే యువకుడి రెండు కళ్లకు డ్రాగన్‌తో పొడిచినట్లు పోలీసులు నిర్ధారించారు. చరణ్‌ బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... చరణ్‌ ఇటీవల కొంతకాలంగా ఓ యువతిని ప్రేమించేవాడు. ప్రేమ విషయం యువతి తల్లిదండ్రులతో పాటు కుటుంబీకులకు నచ్చక పోవడంతో సుపారీ ఇచ్చి దారుణానికి పాల్పడినట్లు ఆరోపించారు. అవ్వ ఇంటికి వెళ్లిన చరణ్‌ను వెంటాడిన దుండగులు దాడి చేసి కళ్లలోకి డ్రాగన్‌తో పొడిచి ఇక ప్రేమించిన యువతిని చూడలేవని హెచ్చరించి వదిలేశారన్నారు. ఫిర్యాదుకు అనుగుణంగానే పోలీసులు గణేష్‌, సోము, చింటు, మను అనేవారిని అరెస్టు చేశారు. వీరిపై ఐపీసీ 506,323, 326, 34 సెక్షన్‌ల కింద కేసులు న మోదు చేశారు. హుళిమావు, సిద్దాపుర పోలీసులు యువతి బంధువులను రక్షించే ప్ర యత్నం చేస్తున్నారని చరణ్‌స తరపు బంధువులు శుక్రవారం ఆరోపించారు. ఈమేరకు చరణ్‌ అవ్వ సరోజమ్మ రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2022-02-26T18:46:36+05:30 IST