రాజీవ్‌స్వగృహ ప్లాట్‌ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-27T15:32:50+05:30 IST

నగరంలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ ఫ్లాట్‌ల కేటాయింపు లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది.

రాజీవ్‌స్వగృహ ప్లాట్‌ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ప్రారంభం

హైదరాబాద్: నగరంలోని బండ్లగూడ, పోచారంలో రాజీవ్ స్వగృహ(Rajiv Swagruha) ఫ్లాట్‌ల కేటాయింపు లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమైంది. బండ్లగూడ, పోచారంలోని 3716 రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల కోసం 39 వేల దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలో 2246 ఫ్లాట్లకు 33161 దరఖాస్తులు, పోచారంలో 1470 ఫ్లాట్లకు 5921 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా బండ్లగూడలోని 3 బీహెచ్‌కే డీలో 345 ఫ్లాట్‌ల కోసం 16 వేల 679 మంది దరఖాస్తులు చేసుకున్నారు. లాటరీ ప్రక్రియ కోసం హెచ్ఎండీఏ (HMDA) అధికారులు.. ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. ఇవాళ పోచారం, రేపు బండ్లగూడ, 29న బండ్లగూడ త్రీ బీహెచ్ కే, డీలక్స్ డ్రా తీయనున్నారు. ఫ్లాట్ నంబర్‌లు, దరఖాస్తుదారుల పేర్లను వేర్వేరుగా ఎంచుకోవడం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు జరుగనుంది. పారదర్శకతను నిర్ధారించడం కోసం పూర్తి ప్రక్రియను హెచ్ఎండీఏ అధికారులు రికార్డ్ చేయనున్నారు. 

Updated Date - 2022-06-27T15:32:50+05:30 IST