జీవితంలో ఓడిపోయా; నన్ను క్షమించు నాన్నా

ABN , First Publish Date - 2022-07-02T05:54:00+05:30 IST

జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీవితంలో ఓడిపోయా; నన్ను క్షమించు నాన్నా అంటూ సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టాడు. ఈ ఘటన సూర్యాపే

జీవితంలో ఓడిపోయా; నన్ను క్షమించు నాన్నా
సింగారపు సంతోష్‌(ఫైల్‌)

సూసైడ్‌ నోట్‌ రాసి యువకుడి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా మద్దిరాలలో ఘటన 

మద్దిరాల, జూలై 1:జీవితంపై విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీవితంలో ఓడిపోయా; నన్ను క్షమించు నాన్నా అంటూ సూసైడ్‌ నోట్‌ రాసిపెట్టాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు చందుపట్ల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలైన సింగారపు ముత్తయ్య, పూలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. ముగ్గురూ హెయిర్‌కటింగ్‌ వృత్తి సాగిస్తున్నారు. ఇంటర్‌ పూర్తి చేసిన చిన్నకుమారుడు సంతోష్‌(24) ఐదేళ్ల కిందట హైదరాబాద్‌కు వెళ్లగా, ఆయన అన్నలు ఐదేళ్ల కిందట ఉపాధి కోసం వలస వెళ్లారు. అక్కడే ఉపాధి పొందుతూ జీవిస్తున్నారు. నెల రోజుల కిందట వరకు అక్కడే పనిచేస్తున్న సంతోష్‌ అకస్మాత్తుగా స్వగ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి ముభావంగా ఉంటున్నాడు. శుక్రవారం తల్లిదండ్రులు పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఉరివేసుకున్నాడు. కొద్దిసేపటికి అతడిని కలిసేందుకు ఇంటికి వచ్చిన స్నేహితులు సంతోష్‌ ఉరివేసుకుని కనిపించడాన్ని చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి మృతి చెందాడు. సంతోష్‌ వద్ద సూసైడ్‌ నోట్‌ లభించగా ‘జీవితంలో ఓడిపోయా; నన్ను క్షమించు నాన్నా’ అంటూ అందులో రాశాడు. ఆత్మహత్యపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ నర్సింగ్‌ వెంకన్న తెలిపారు. సంతోష్‌ అంత్యక్రియలు సాయంత్రం గ్రామంలో నిర్వహించారు. 

Updated Date - 2022-07-02T05:54:00+05:30 IST