రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2022-05-22T03:10:54+05:30 IST

రోడ్డుపై ఆగిఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీ కొన్న ప్రమాదంలో డ్రైవర్‌ మహ్మద్‌ అన్వర్‌ (42) మృతి చెందాడు.ఈ

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి
అబ్దుల్లా మృతదేహం

కావలి రూరల్‌, మే21: రోడ్డుపై ఆగిఉన్న లారీని వెనుక  నుంచి మరో లారీ ఢీ కొన్న ప్రమాదంలో డ్రైవర్‌ మహ్మద్‌ అన్వర్‌ (42) మృతి చెందాడు.ఈ సంఘటన శనివారం సాయంత్రం కావలి మద్దూరుపాడు జాతీయ రహదారిపై జరిగింది. రూరల్‌ పోలీసుల కథనం మేరకు, మద్దూరుపాడు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న  పెట్రోల్‌ బంక్‌ వద్ద మార్బుల్‌  దింపేందుకు రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని, వెనుక నుంచి మరో కంటైనర్‌ లారీ ఢీ కొంది. ఈ ప్రమాదం లో కంటైనర్‌ తిరగబడటంతో డ్రైవర్‌ అన్వర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని 108 వాహనంలో ఏరియా వైద్య శాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని  పోలీసులు పరిశీలించారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైధ్యశాలకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వీరేంద్రబాబు తెలిపారు.

Updated Date - 2022-05-22T03:10:54+05:30 IST