లారీ, మినీ లారీ ఢీ - క్లీనర్‌ మృతి

ABN , First Publish Date - 2022-08-13T05:17:06+05:30 IST

ఆగి ఉన్న లారీని మినీ లారీ ఢీకొనడంతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయి క్లీనర్‌ వేముల వెంకటేష్‌ (22) మృతి చెందాడు.

లారీ, మినీ లారీ ఢీ - క్లీనర్‌ మృతి
క్యాబిన్‌లో ఇరుక్కు పోయిన క్లీనర్‌ వెంకటేష్‌

వరికుంటపాడు, ఆగస్టు 12: ఆగి ఉన్న లారీని మినీ లారీ ఢీకొనడంతో క్యాబిన్‌లో ఇరుక్కుపోయి క్లీనర్‌ వేముల వెంకటేష్‌ (22) మృతి చెందాడు. నెల్లూరు జిల్లా వరి కుంటపాడు కోల్డ్‌ స్టోరేజ్‌ వద్ద 565వ జాతీయ రహదా రిపై శుక్రవారం జరిగిన ఘటనపై స్థానికులు, పోలీసుల కథనం మేర కు.. మదనపల్లె నుంచి టమోటా లోడుతో నర్సీపట్నం వెళ్తున్న లారీ కోల్డ్‌ స్టోరేజీ వద్ద ఆగి ఉంది. శుక్రవారం తెల్లవారు జామున  పోరుమామిళ్ల నుంచి కనిగిరి వెళ్తున్న మినీ పాల లారీ ఢీకొనడంతో మినీ లారీలో ఉన్న గోపవరం మండలం వడ్డే ఆగ్రహారం వాసి క్లీనర్‌ వెంకటేష్‌ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. మైదుకూరు వాసి డ్రైవర్‌ చెంగారి సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను చిక్సిత్స నిమిత్తం తర లించేందుకు 108కు సమాచారం ఇచ్చినా అందుబాటులో లేకపోవడంతో దాదాపు 40 నిమిషాల వరకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ క్లీనర్‌ క్యాబిన్‌లోనే మృతి చెందాడు. త నను కాపాడాలంటూ చివరి క్షణంలో క్లీనర్‌ చేసిన ఆర్తనాదాలు పలువురిని కంటతడి పెట్టించాయి. 108 వాహనం సకాలంలో వచ్చి ఉంటే క్లీనర్‌ బతికేవాడని డ్రైవర్‌ సురేష్‌ తెలిపాడు. పోలీసులు సంఘటనా స్థలి చేరుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. 

బైక్‌ అదుపుతప్పి పడి ఒకరి మృతి

సీతారామపురం, ఆగస్టు 12: సీతారామపురం - పోరుమామిళ్ల ఘాట్‌రోడ్డులో శుక్రవారం వేకువజామున మోటార్‌ సైకిల్‌ అదుపుతప్పి పడి పోరుమామిళ్ల వాసి కామాటి వెంకటయ్య(44) మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు... ప్రకాశం జిల్లా సీతారామపురంలో జరుగుతున్న మొహర్రం వేడుకలను తిలకించేందుకు వెంకట య్య బంధువుల ఇంటికి వచ్చి తిరిగి పోరుమామిళ్లకు బైక్‌పై వెళుతుండగా మార్గమధ్యలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి సమయంలో ఘాట్‌రోడ్డులో అటవీ జంతువులు తగిలి అదుపుతప్పి పడి  మృతి చెంది ఉండవచ్చని పోలీసులు, మృతుడి బంధువులు భావిస్తు న్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కిషోర్‌బాబు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో....

దువ్వూరు, ఆగస్టు 12: మండల పరిధిలోని ఐ.బయనపల్లె వద్ద గురువారం రాత్రి బైకు, ట్రాక్టర్‌ ఢీకొనగా దారపునేని మునిస్వామి (53) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మునిస్వామి మృతిచెందాడు. దువ్వూరు మండలం రామాపురంకు చెందిన  దారపునేని మునిస్వామి మైదుకూరు నుండి స్వగ్రామం రామాపురంకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు దువ్వూరు ఎస్‌ఐ కేసీ రాజు పేర్కొన్నారు.



Updated Date - 2022-08-13T05:17:06+05:30 IST