రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-02-25T05:19:31+05:30 IST

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి

బొంరా్‌సపేట్‌: రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్‌ మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. కొడంగల్‌ నుంచి హైదరాబాద్‌ వైపు సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ ముందు టైర్లు పగిలి అదుపు తప్పి బొట్లవనితండా- చౌదర్‌పల్లి గేటు సమీపంలో రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ఘటనలో లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి తీవ్ర గాయాలైన డ్రైవర్‌ ఆనంద్‌ను కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆనంద్‌కుమార్‌ కర్నాటక రాష్ట్రం గుల్బర్గ జిల్లా రాజాపూర్‌ తాలూకా వాసి. 

Updated Date - 2021-02-25T05:19:31+05:30 IST