లారీ ఢీకొని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2020-10-01T07:47:54+05:30 IST

కడియం భాస్కర్‌నగర్‌ సమీపంలో లారీ ఢీకొన్న సంఘటనలో కడియపులంకకు చెందిన వృద్ధుడు మృతిచెందాడు.

లారీ ఢీకొని వృద్ధుడి మృతి

కడియం, సెప్టెంబరు 30: కడియం భాస్కర్‌నగర్‌ సమీపంలో లారీ ఢీకొన్న సంఘటనలో కడియపులంకకు చెందిన వృద్ధుడు మృతిచెందాడు. పోలీసులు కథనం ప్రకారం... కడియపులంక గ్రామానికి చెందిన కోలాటి యేసేబు(60) సైకిల్‌ మీద పురుగుల మందు కొనుగోలుకు బుధవారం కడియం వచ్చాడు.


తిరిగి వెళ్తుండగా బుర్రిలంక నుంచి కడియం వైపు వస్తున్న లారీ భాస్కరనగర్‌ సమీపంలో యేసేబును ఢీ కొంది. దీంతో తీవ్రగాయాలైన అతడికి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఏసేబు అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. యేసేబు బంధువు కోలాటి రాంబాబు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కెనాగరాజు కేసు నమోదు చేశారు.


Updated Date - 2020-10-01T07:47:54+05:30 IST