పూర్తయిన సత్యదేవుని బంగారు ఆభరణాల తనిఖీ ప్రక్రియ
ABN , First Publish Date - 2022-05-28T06:08:12+05:30 IST
రత్నగిరివాసుడైన సత్యదేవుని సన్నిధిలో బంగారు ఆభరణాల తనిఖీ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. దేవదాయ శాఖ కమిషనరు ఆదేశాలతో జ్యువెల్లరీ వెరిఫికేషన్ అధికారిణి అల్లు దుర్గాభవాని జనవరిలో కొన్నింటిని తనిఖీ చేశారు.
అన్నవరం, మే 27: రత్నగిరివాసుడైన సత్యదేవుని సన్నిధిలో బంగారు ఆభరణాల తనిఖీ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. దేవదాయ శాఖ కమిషనరు ఆదేశాలతో జ్యువెల్లరీ వెరిఫికేషన్ అధికారిణి అల్లు దుర్గాభవాని జనవరిలో కొన్నింటిని తనిఖీ చేశారు. బ్యాంకు లాకర్లు, అర్చకుల ఆధీనంలో ఉన్న మిగిలిన ఆభరణాలను శుక్రవారం తనిఖీ చేసి రికార్డులపరంగా సరిపోయాయని దుర్గాభవాని తెలిపారు. ఈవో త్రినాథరావు, సహాయ కమిషనర్ రమేష్బాబు, సూపరింటెండెంట్ అనకాపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.