భైంసాలో శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభం
ABN , First Publish Date - 2022-04-10T19:24:25+05:30 IST
భైంసాలో శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది.
నిర్మల్: భైంసాలో శ్రీరాముడి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. పురాణాబజార్ నుంచి శోభాయాత్రను ఎంపీ బాపురావు ప్రారంభించారు. భజరంగదల్, బీజేపీ నేతల సందడిగా శోభాయాత్రను కొనసాగిస్తున్నారు. రాంలీల మైదానం వరకు శోభాయాత్ర కొనసాగనున్నది. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.