నృసింహావతారంలో జగన్నాథుడు
ABN , First Publish Date - 2022-07-06T05:50:26+05:30 IST
: టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయంలో రఽథయాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
మహారాణిపేట, జూలై 5: టౌన్ కొత్తరోడ్డు జగన్నాథస్వామి ఆలయంలో రఽథయాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవంలో భాగంగా టౌర్నర్ చౌల్ర్టీ కల్యాణ మండపంలో ప్రతిష్ఠించిన సుభద్ర, బలభద్ర సమేత జగన్నాఽథ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. దశావతారాలలో భాగంగా నాలుగవ రోజు మంగళవారం స్వామి వారు నృసింహ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా స్వామి వారికి ఉదయం మేలుకొలుపు నాదస్వరం నిత్యార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింహాచలం దేవస్థానం జగన్నాథ స్వామికి పట్టువస్త్రాలను సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. బుధవారం స్వామి వారు వామనావతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు