బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో రిమోట్‌ ఓటింగ్‌!

ABN , First Publish Date - 2020-08-12T07:34:26+05:30 IST

పోలింగ్‌ కేంద్రానికి వెళ్లకుండా రిమోట్‌ ప్రక్రి య ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) దృష్టి పెట్టింది. ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో దూర భారాలను అధిగమించేందుకు...

బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీతో రిమోట్‌ ఓటింగ్‌!

  • వెబినార్‌లో ఈసీ అధికారుల సూచనలు


న్యూఢిల్లీ, ఆగస్టు 11: పోలింగ్‌ కేంద్రానికి వెళ్లకుండా రిమోట్‌ ప్రక్రియ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) దృష్టి పెట్టింది. ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో దూర భారాలను అధిగమించేందుకు ‘బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీ’ ఎంతో ఉపకరిస్తుందని ఈసీ అధికారులు భావిస్తున్నారు. ఈసీ సోమవారం నిర్వహించిన వెబినార్‌లో ఎన్నికల కమిషనర్‌ సుశీల్‌ చంద్ర ఈ టెక్నాలజీ ప్రాధాన్యాన్ని వివరించారు. ఒక వ్యక్తి తన ఓటు నమోదైన ప్రాంతంలోనూ మరోచోట ఉన్నప్పుడు స్పెషల్‌ రిమోట్‌ పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయడం ముఖ్యమైన అంశమన్నారు. ప్రత్యామ్నాయ ఓటింగ్‌ పద్ధతి పారదర్శకంగా ఉండాలన్నారు. ఈ బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీని వాడుకోవాలని ఈసీ సెక్రటరీ జనరల్‌ ఉమేశ్‌ సిన్హా సూచించారు.


Updated Date - 2020-08-12T07:34:26+05:30 IST