చీమలు ఎంత పనిచేశాయో.. ఏకంగా విమానాన్నే..
ABN , First Publish Date - 2021-09-07T13:48:59+05:30 IST
టేకాఫ్కు రెడీగా ఉన్న ఓ భారీ విమానాన్ని చీమలదండు నిలిపివేసింది.
విమానాన్ని నిలిపివేసిన చీమలదండు..
న్యూఢిల్లీ: టేకాఫ్కు రెడీగా ఉన్న ఓ భారీ విమానాన్ని చీమలదండు నిలిపివేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి సోమవారం లండన్ వెళ్లాల్సిన ఓ ఎయిరిండియా విమానం ఇలా ఓ చీమలదండు వల్ల నిలిచిపోయింది. పైగా ఆ విమానంలో భూటాన్ యువరాజు పయనించాల్సి ఉంది. ఏఐ-111 విమానంలోని బిజినెస్ క్లాస్లో భారీ సంఖ్యలో చీమలు ఉండడం గమనించిన సిబ్బంది వెంటనే పైలట్లకు సమాచారం అందించడంతో చివరి నిమిషంలో విమానం ఆగిపోయింది. దానిస్థానంలో మరో విమానాన్ని అధికారులు లండన్ పంపించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ఎయిరిండియా విమానం ఏఐ-111 లండన్ వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. 248 మంది ప్రయాణికులు విమానం కూడా ఎక్కేశారు. ప్రయాణికుల్లో భూటాన్ యువరాజు జిగ్మే ఖేసర్ నాంగ్యెల్ వాంగ్చుక్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో బిజినెస్ క్లాస్లోని ప్రయాణికులు ఒక్కసారిగా గగ్గొలు పెట్టడం మొదలెట్టారు. దాంతో విమాన సిబ్బంది వెంటనే బిజినెస్ క్లాస్కు వెళ్లి చూసింది. వారికి అక్కడ కనిపించిన దృశ్యం చూసి నోటమాట రాలేదు. అక్కడ భారీ సంఖ్యలో చీమలు ఉన్నాయి.
ఈ విషయాన్ని సిబ్బంది వెంటనే పైలట్లకు చేరవేసింది. దాంతో పైలట్లు విమానం టేకాఫ్ను ఆపేశారు. అనంతరం సిబ్బంది వెంటనే విమానంలోని 248 ప్రయాణికులను విమానం నుంచి దించేశారు. అనంతరం అధికారులు కొంత సమయం తర్వాత మరో విమానంలో ప్రయాణికులకు లండన్కు పంపించారు. ఈ ఘటన కారణంగా విమానంలోని ప్రయాణికులు ఏకంగా రెండు గంటల పాటు విమానాశ్రయంలోనే వేచి చూడాల్సిన పరిస్థితి దాపురించింది. ఇలా ఓ చీమలదండు ఏకంగా విమానం నిలిచిపోవడానికి కారణమైంది.