అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం: లోకేష్
ABN , First Publish Date - 2021-07-28T08:49:20+05:30 IST
టీడీపీ కార్యకర్తలు, నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్న వైసీపీకి.. తిరిగి తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని..
టీడీపీ కార్యకర్తలు, నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్న వైసీపీకి.. తిరిగి తాము అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హెచ్చరించారు. మంగళవారం ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. పలువురు పార్టీ నేతలను పరామర్శించారు. సామర్లకోటలో పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలను, మురారిలో కందుల కొండయ్యదొర విగ్రహాన్ని ఆవిష్కరించి బహిరంగ సభల్లో మాట్లాడారు.
- ఆంధ్రజ్యోతి, కాకినాడ