రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారు: లోకేశ్‌

ABN , First Publish Date - 2022-06-03T23:40:56+05:30 IST

ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ నేత లోకేశ్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడులో టీడీపీ వర్గీయుడు జల్లయ్య హత్య...

రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారు: లోకేశ్‌

విజయవాడ: ఒక్క చాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చారని టీడీపీ నేత లోకేశ్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడులో టీడీపీ వర్గీయుడు జల్లయ్య హత్య... మరో ఇద్దరిపై దాడి వైసీపీ రాక్షసత్వానికి పరాకాష్ఠ అని దుయ్యబట్టారు. వందలమంది టీడీపీ వర్గీయులను చంపినా సీఎం జగన్ రక్తదాహం తీరదా?.. వైసీపీ నరమేధం ఇంకెన్నాళ్లు? అని ప్రశ్నించారు. ఆపకుంటే తీవ్రపరిణామాలుంటాయని, అన్ని బాకీలు సెటిల్‌చేస్తామని లోకేశ్‌ స్పష్టం చేశారు.

Updated Date - 2022-06-03T23:40:56+05:30 IST