జగన్ రాక్షసుడు... చంద్రబాబు రాముడు: లోకేష్
ABN , First Publish Date - 2022-04-08T01:00:25+05:30 IST
మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు.
అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ పర్యటించారు. గడప గడపకు వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. విద్యుత్ ఛార్జీలకు నిరసనగా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెల పంపిణీ చేశారు. పట్టాలిస్తామని ఎమ్మెల్యే మోసంచేశాడని స్థానికులు వాపోయారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... ఇళ్ల పట్టాల సమస్యపై పెద్ద ఎత్తున పోరాడుదామన్నారు. తాడేపల్లిలో యూ1 జోన్ ఎందుకు రద్దు చేయలేదు? అని ఆయన ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో ఆర్కేని మించినవారు లేరన్నారు. జగన్ రాక్షసుడు.. చంద్రబాబు రాముడన్నారు. మూడేళ్లు అయినా జగన్రెడ్డికి బుద్ధిరాలేదని విమర్శించారు.