నేడు సంజీవని ఆరోగ్య రథంను ప్రారంభించనున్న లోకేష్
ABN , First Publish Date - 2022-08-10T12:40:01+05:30 IST
నేడు సంజీవని ఆరోగ్య రథంను ప్రారంభించనున్న లోకేష్
గుంటూరు: నేడు సంజీవని ఆరోగ్య రథంను టీడీపీ నేత నారా లోకేష్ ప్రారంభించనున్నారు. దుర్గిరాల టీడీపీ ఆఫీస్ దగ్గర ఆరోగ్యరథం ప్రారంభమవుతుంది. పేదలకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు మొబైల్ ఆస్పత్రికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్య రథంలో అత్యాధునిక చికిత్స పరికరాలు, పరీక్ష యంత్రాలు ఉండనున్నాయి. ఆరోగ్య రథం దగ్గర 200లకు పైగా రోగ నిర్థారణ పరీక్షలు, మందులు అందుబాటులో ఉంటాయి.