పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం: లోకేష్

ABN , First Publish Date - 2021-09-01T03:52:24+05:30 IST

పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం: లోకేష్

పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం: లోకేష్

రాజమండ్రి: విలీన మండలాల్లోని పోలవరం ముంపు గ్రామాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ పర్యటన ముగిసింది. చింతూరు రోడ్ షోలో పోలవరం నిర్వాసితులను ఉద్దేశించి లోకేష్ ప్రసంగించారు. రెండేళ్లలో తిరిగి అధికారంలోకి వస్తామని, పోలవరం నిర్వాసితులందరికి పూర్తిగా న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. చింతూరు నుంచి రోడ్డు మార్గంలో మారేడుమిల్లికి లోకేష్ చేరుకున్నారు. ఈ రోజు రాత్రికి మారేడుమిల్లిలో లోకేష్ బస చేయనున్నారు. బుధవారం రంపచోడవరం, దేవీపట్నం మండలాల్లోని ముంపు గ్రామాల్లో లోకేష్ పర్యటించనున్నారు.

Updated Date - 2021-09-01T03:52:24+05:30 IST