పల్నాడు రోడ్డు ప్రమాదంపై Lokesh దిగ్భ్రాంతి

ABN , First Publish Date - 2022-05-30T15:01:27+05:30 IST

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు.

పల్నాడు రోడ్డు ప్రమాదంపై Lokesh దిగ్భ్రాంతి

అమరావతి: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ప్రమాదంలో ఏడుగురి మృతి కలచివేసిందని ఆవేదన చెందారు. మృతుల కుటుంబాలకు టీడీపీ నేత తన ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని లోకేష్ డిమాండ్ చేశారు. 


Updated Date - 2022-05-30T15:01:27+05:30 IST