పెద్దిరెడ్డిపై నారా లోకేష్ ఫైర్
ABN , First Publish Date - 2021-04-17T19:47:05+05:30 IST
పెద్దిరెడ్డిపై నారా లోకేష్ ఫైర్
అమరావతి: మంత్రి పెద్దిరెడ్డిపై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. పుంగనూరు వీరప్పన్ పెద్దిరెడ్డని విమర్శించారు. ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్టే ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. పెద్దిరెడ్డికి చెందిన పీఎల్ఆర్ కళ్యాణమండపంలో 5 వేల మంది మకాం వేశారని పేర్కొన్నారు. దొంగ ఓట్లు వేయడానికి వెళ్తున్న వారిని టీడీపీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. వైసీపీ రిగ్గింగ్, దొంగ ఓట్లతో గెలవాలని చూస్తోందన్నారు. ఈసీ స్పందించి మంత్రులను అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.