చంద్రన్న బాటలోకి రావాల్సిందే

ABN , First Publish Date - 2022-05-18T09:57:38+05:30 IST

‘‘జగన్‌రెడ్డీ... ఎన్ని విమర్శలు చేసినా ఆఖరికి నడవాల్సింది చంద్రన్న బాటలోనే’

చంద్రన్న బాటలోకి రావాల్సిందే

అప్పుడు మేం తెచ్చిన గ్రీన్‌కోకి ఇప్పుడు రిబ్బన్‌ కటింగ్‌: లోకేశ్‌

అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): ‘‘జగన్‌రెడ్డీ... ఎన్ని విమర్శలు చేసినా ఆఖరికి నడవాల్సింది చంద్రన్న బాటలోనే’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘‘గ్రీన్‌ కోలో భారీ అవినీతి అంటూ మాపై బురద వేయాలని ప్రయత్నించావు. ఇప్పుడు మేం తెచ్చిన కంపెనీకి రిబ్బన్‌ కట్‌ చేసి, మాపై ఆరోపణలన్నీ అవకాశవాద రాజకీయం కోసమే అని స్వయంగా మీరే ఒప్పుకున్నందుకు థాంక్స్‌’’ అని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2022-05-18T09:57:38+05:30 IST