మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే: లోకేష్
ABN , First Publish Date - 2021-11-22T22:21:15+05:30 IST
మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అని సీఎం జగన్ ఉద్దేశించి టీడీపీ నేత నారా లోకేష్ ధ్వజమెత్తారు.
అమరావతి: మూర్ఖుడు మారాలని కోరుకోవడం అత్యాశే అని సీఎం జగన్ ఉద్దేశించి టీడీపీ నేత నారా లోకేష్ ధ్వజమెత్తారు. అసెంబ్లీని అసత్య వేదికగా మార్చేశారని ట్విట్టర్లో లోకేష్ మండిపడ్డారు. ఇల్లు ఇక్కడే కట్టా, అమరావతే రాజధాని అంటూ ఎన్నికలకు వెళ్లిన వ్యక్తి.. 3 రాజధానులు చేయమని ప్రజలు తీర్పు ఇచ్చారనడం హైలైట్ అన్నారు. మురుగు బుర్రలకి మెరుగైన ఆలోచనలు రావడం ఎప్పటికీ జరగని పని నారా లోకేష్ అన్నారు.