రైతుల మెడకి ఉరి తాడు బిగిస్తున్నా జగన్: లోకేష్
ABN , First Publish Date - 2022-06-14T18:33:31+05:30 IST
మాట మార్చి..మడమ తిప్పి.. జగన్ మోసపు రెడ్డి చేసిన ప్రతి మోసాన్ని బయటపెడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
అమరావతి: జగన్ మోసపు రెడ్డి చేసిన ప్రతి మోసాన్ని బయటపెడతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాడు టీడీపీ ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని.. అవాస్తవ ప్రచారం చేసిన జగన్రెడ్డి.. నేడు రైతుల మెడకి మీటర్ల రూపంలో ఉరి తాడు బిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. రైతులకిచ్చిన ఏ ఒక్క హామీని నెరవెర్చలేదని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఉన్నారని, వైసీపీ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని నారా లోకేష్ ధ్వజమెత్తారు.