వడ్డీతో సహా చెల్లిస్తాం: లోకేశ్‌

ABN , First Publish Date - 2021-02-26T09:02:36+05:30 IST

టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడినవారికి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు. కృష్ణాజిల్లా ఎ.కొండూరు మండలం గొల్లలమందలో వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడి...

వడ్డీతో సహా చెల్లిస్తాం: లోకేశ్‌

  • టీడీపీ కార్యకర్త సోమయ్య కుటుంబానికి పరామర్శ 


ఎ.కొండూరు, ఫిబ్రవరి 25: టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడినవారికి వడ్డీతో సహా చెల్లిస్తామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ హెచ్చరించారు. కృష్ణాజిల్లా ఎ.కొండూరు మండలం గొల్లలమందలో వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడి మృతిచెందిన టీడీపీ కార్యకర్త పాలకొల్లు సోమయ్య కుటుంబ సభ్యులను ఆయన గురువారం పరామర్శించారు. వారి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం లోకేశ్‌ మాట్లాడుతూ జగన్‌రెడ్డి ఒక పిరికిపందని, ప్రజల విశ్వాసం కోల్పోయారన్నారు. ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. టీడీపీ శ్రేణులపై దాడులకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అంతకుమందు రామచంద్రాపురం గ్రామంలో ఎన్నికల సందర్భంగా వైసీపీ వర్గీయుల దాడిలో గాయపడిన మండల పార్టీ అధ్యక్షుడు గడ్డి కృష్ణారెడ్డి, ఆయన భార్య రోజారాణిని లోకేశ్‌ పరామర్శించారు. కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్‌ ఇన్‌ చార్జి నెట్టెం రాఘురాం, మాజీ మంత్రులు దేవినేని ఉమ, జవహర్‌, మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-26T09:02:36+05:30 IST