ఛాలెంజ్‌కు భయపడి పులివెందుల పిల్లి పారిపోయింది: లోకేశ్

ABN , First Publish Date - 2021-04-14T18:38:11+05:30 IST

అలిపిరిలో టీడీపీ నేత నారా లోకేష్‌ ప్రమాణం చేశారు. వివేకా హత్యలో తనకుగానీ, తమ కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి పాత్ర లేదని.. వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు.

ఛాలెంజ్‌కు భయపడి పులివెందుల పిల్లి పారిపోయింది: లోకేశ్

తిరుపతి: అలిపిరిలో టీడీపీ నేత నారా లోకేష్‌  ప్రమాణం చేశారు. వివేకా హత్యలో తనకుగానీ, తమ కుటుంబ సభ్యులకు గానీ ఎలాంటి పాత్ర లేదని.. వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి జగన్‌రెడ్డి బయటికి రాలేదన్నారు. చెల్లికి న్యాయం చేయలేనివాడు మహిళలకు ఏం న్యాయం చేస్తాడు? అని ప్రశ్నించారు. వైఎస్ వివేకా హత్యలో జగన్‌రెడ్డి పాత్ర ఉంది.. అందుకే రాలేదన్నారు. తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చి ప్రమాణం చేశామన్నారు. కత్తులతో బతికే చరిత్ర ఏ కుటుంబానిదో ప్రజలకు తెలుసన్నారు. జగన్‌రెడ్డి సొంత కుటుంబ సభ్యుల్ని చంపాడని ఆరోపించారు. ఇదిలా ఉంటే, ‘‘ఛాలెంజ్‌కి భయపడి పులివెందుల పిల్లి పారిపోయింది. ఈ రోజు బాబాయ్ మర్డర్ మిస్టరీ వీడిపోయింది. బాబాయ్‌ని వేసేసింది అబ్బాయే’’ అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. 



Updated Date - 2021-04-14T18:38:11+05:30 IST