ఘనంగా లోకేష్‌ పుట్టిన రోజు వేడుక

ABN , First Publish Date - 2021-01-24T07:19:59+05:30 IST

మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా లోకేష్‌ పుట్టిన రోజు వేడుక
ముత్తుముల అశోక్‌రెడ్డి తన నివాస గృహంలో లోకేష్‌ జన్మదిన వేడుక

గిద్దలూరు, జనవరి 23 : మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ జన్మదిన వేడుకలను స్థానిక టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి తన నివాస గృహంలో జరిగిన లోకేష్‌ పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని కేక్‌ కట్‌ చేసి నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు పంచిపెట్టారు. చెన్నుపల్లి టీడీపీ యూత్‌ ఆద్వర్యంలో జరిగిన లోకేష్‌ జన్మదిన వేడుకల్లో సైతం మాజీఎమ్మెల్యే అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో మాజీ జడ్పీటీసీ సభ్యులు వీవీ.రాఘవరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్‌ మస్తాన్‌, టీడీపీ నాయకులు పెద్దభాషా, సయ్యద్‌ వలి, కొండయ్య యాదవ్‌, లింగయ్య, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

కంభం : కంభం పట్టణం, కందులాపురం సినిమాహాలు సెంటర్‌లో లోకేష్‌ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ మండల ఉపాధ్యక్షుడు ఎస్‌కే.హుస్సెన్‌(దాదా), తోట శ్రీను, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, తోట శ్రీను, మురళీ, ఎల్‌.కోట వెంకటేశ్వర్లు, గౌస్‌, రవి పాల్గొన్నారు. 

త్రిపురాంతకం : పట్టణ తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 10 కిలోల కేక్‌ను కట్‌చేసి కార్యకర్తలకు అభిమానుకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు చల్లా వెంకటేశ్వరరెడ్డి, చాగంటి సత్యనారాయణ, దగ్గుల కళ్యాణ్‌రెడ్డి, మాలకొండరాయుడు, నల్లబోతుల అయ్యప్ప, షేక్‌ సైదా తదితరులు పాల్గొన్నారు.

పెద్దారవీడు :  హనుమాన్‌ జంక్షన్‌ కుంటలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉమ్మడి వీరారెడ్డి, వేగినాటి శ్రీనివాసు, శనగ నారాయణరెడ్డి, షేక్‌ జిలాని, వడ్లమూడి లింగయ్య, వల్లభనేని కాశయ్య, షేక్‌ మాబు ఇండ్ల రామకృష్ణరెడ్డి, చిట్యాల వెంగల్‌రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 ఎర్రగొండపాలెం : భవిష్యత్‌లో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్‌ అని జడ్పీ మాజీ ఉపాధ్యక్షుడు డాక్టరు మన్నె రవీంద్ర అన్నారు. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ 38వ పుట్టినరోజు వేడుకలను శనివారం ఎర్రగొండపాలెంలో ఘనంగా నిర్వహించారు. డాక్టరు మన్నె రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు నారా లోకేష్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ప్రజల్లో మార్పు వచ్చిందని అన్నారు.  38 కిలోల కేక్‌ కట్‌ చేసి నాయకులకు కార్యకర్తలకు పంపిణీచేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు  చేకూరి సుబ్బయ్య, టీడీపీ ముఖ్యనాయకులు తోట మహెష్‌, ఎం శివరామకిష్ణ,  టీడీపీ  ముఖ్యనాయకులు, అభిమానులు పాల్గొన్నారు. 

ఎర్రగొండపాలెం ప్రధాన కూడలిలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ  మాజీ అఽధ్యక్షుడు షేక్‌ జిలానీ, శనగా నారాయణరెడ్డి, వడ్లమూడి లింగయ్య, గొట్టం శ్రీనివాసరెడ్డి, కార్యకర్తలు పంచుకున్నారు.

పెద్ద దోర్నాల : దోర్నాలలో జరిగిన కార్యక్రమంలోటీడీపీ జిల్లా ఉఫాధ్యక్షుడు బట్టు సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కేకును కత్తిరించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో లోకేశ్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కార్యదర్శి దొడ్డా శేషాద్రి, నాయకులు నాగెళ్ల సత్యనారాయణ, దేసు నాగేంద్రబాబు, ఎన్‌బీకే మండల అధ్యక్షులు ఈదర మల్లయ్య, రామకృష్ణయ్య, షేక్‌ రఫీ, షేక్‌ ఖాన్‌, శేషిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T07:19:59+05:30 IST