కలెక్టర్కు లోకాయుక్త నోటీసులు
ABN , First Publish Date - 2021-07-31T04:49:42+05:30 IST
కలెక్టర్కు లోకాయుక్త నోటీసులు
- ఆగస్టు 2న కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు
తాండూరు: తాండూరు పట్టణ ప్రగతిలో బ్లీచింగ్ పౌడర్ కొనుగోళ్లు, చిలుకవాగు వద్ద జరిగిన పనులకు సంబంధించి భారీ స్కాం జరిగిందని కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ వరాల శ్రీనివా్సరెడ్డి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఆగస్టు 2వ తేదీన కోర్టుకు హాజరు కావాలని కలెక్టర్ పౌసుమిబసుకు లోకాయుక్త నుంచి నోటీసులు జారీ అయ్యాయి. కలెక్టర్తో పాటు ఫిర్యాదుదారుడు శ్రీనివా్సరెడ్డి కూడా హాజరు కావాలని కోరింది. గత ఏడాదిగా టీజేఎస్ ఫ్లోర్లీడర్ సోంశేఖర్, సీపీఎం ఫ్లోర్లీడర్ అసిఫ్, కాంగ్రెస్ ఫ్లోర్లీడర్ వరాల శ్రీనివా్సరెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్లు మధుబాల, మమత అనేక మార్లు సీడీఎంఏ కార్యాలయం, కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులపై సీడీఎంఏ కార్యాలయం మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ అధికారులకు అప్పట్లో నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయినప్పటికీ ఎలాంటి విచారణ చర్యలు జరగలేదని శ్రీనివా్సరెడ్డి కలెక్టర్పై లోకాయుక్తలో ఆరు కేసులు వేయగా నోటీసులు జారీచేసింది.