విశాఖ: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద లోక్ సత్తా పార్టీ నిరసన

ABN , First Publish Date - 2021-12-15T17:36:38+05:30 IST

ఎయిడ్స్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లోక్ సత్తా పార్టీ నిరసన...

విశాఖ: జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద లోక్ సత్తా పార్టీ నిరసన

విశాఖపట్నం: ఎయిడ్స్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద లోక్ సత్తా పార్టీ నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికసంఖ్యలో హెచ్ఐవి బాధితులు పలు సమస్యలతో బాధపడుతున్నారన్నారు. పిల్లలు సైతం వ్యాధి బారిన పడితే ప్రభుత్వం వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవరిస్తోందని విమర్శించారు. బాధితులకు పింఛన్‌తో పాటు పౌష్టికాహారం ఏర్పాటు చేయాలని లోక్ సత్తా డిమాండ్ చేస్తోందన్నారు. ఒకొక్క భాధితుడికి నెలకు దీర్ఘకాలిక పెన్షన్ రూ. 10 వేలు ఇవ్వాలని బాబ్జీ డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-15T17:36:38+05:30 IST