ఎంపీ అర్వింద్‌కి లోక్‌సభ స్పీకర్ ఫోన్

ABN , First Publish Date - 2022-01-29T01:04:31+05:30 IST

ఎంపీ అర్వింద్‌కి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఫోన్ చేశారు. ఆర్మూర్‌ ఘటనపై స్పీకర్‌ ఓంబిర్లా ఆరా తీశారు. ఘటన, పోలీసులు వ్యవహరించిన తీరుపై అర్వింద్‌ వివరణ ఇచ్చారు.

ఎంపీ అర్వింద్‌కి లోక్‌సభ స్పీకర్ ఫోన్

హైదరాబాద్‌: ఎంపీ అర్వింద్‌కి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఫోన్ చేశారు. ఆర్మూర్‌ ఘటనపై స్పీకర్‌ ఓంబిర్లా ఆరా తీశారు. ఘటన, పోలీసులు వ్యవహరించిన తీరుపై అర్వింద్‌ వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై పోలీసుల సహకారంతో హత్యాయత్నం చేసిందని స్పీకర్‌కి అర్వింద్ చెప్పారు. వెంటనే ఢిల్లీకి రావాలని అర్వింద్‌కు స్పీకర్ చెప్పారు. మరో రెండ్రోజుల్లో ఢిల్లీ వెళ్లి స్పీకర్‌కి  అర్వింద్ ఫిర్యాదు చేయనున్నారు. 

Updated Date - 2022-01-29T01:04:31+05:30 IST