లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , First Publish Date - 2022-08-07T04:30:05+05:30 IST
జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్తయ్య అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ను కోర్టు కాంప్లెక్స్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా రాజీ కుదరని కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు.
ఏసీసీ, ఆగస్టు 6: జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సత్తయ్య అన్నారు. శనివారం జిల్లా కోర్టులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13న జాతీయ లోక్ అదాలత్ను కోర్టు కాంప్లెక్స్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్నో ఏండ్లుగా రాజీ కుదరని కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. పెద్ద మొత్తంలో కేసులు పరిష్క రించేందుకు కృషి చేయాలని సూచించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి మైత్రే యి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్కుమార్, ప్రిన్సిపల్ జూనియర్ సివి ల్ జడ్జి మహతివైష్ణవి, జూనియర్ సివిల్ జడ్జిలు ఉపనీషద్వాని, అసదుల్లాషరీఫ్, సుమన్ గ్రేవాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవిందర్రావు, ఏసీపీలు తిరుపతిరెడ్డి, ఎడ్ల మహేష్, సీఐలు, న్యాయవాదులు పాల్గొన్నారు.