లోక్అదాలత్లో కేసుల పరిష్కారానికి కృషి చేయాలి
ABN , First Publish Date - 2022-08-09T05:56:13+05:30 IST
లోక్అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా న్యాయవాదులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి
మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తిరుపతి
రంగారెడ్డి జిల్లా కోర్టులు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): లోక్అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కరించేలా న్యాయవాదులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టుల మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి తిరుపతి పిలుపునిచ్చారు. వచ్చేలోక్అదాలత్ గురించి సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూమి తగాదా కేసులు, ఫ్యామిలీ, చెక్కు బౌన్స్, మోటారు వాహనాల కేసులు లోక్అదాలత్లో సత్వర పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఈ సంవత్సరం నిర్వహించిన మూడు లోక్అదాలత్లలో సుమారు 5,342 పెండింగ్ కేసులలో 152 కేసులు పూర్తిగా పరిష్కారమయ్యాయన్నారు. 80 వేల పెట్టి కేసులు పరిష్కారమయ్యాయన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు మోహన్, లక్ష్మీదేవి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.