ఐటీడీఏ కార్యాలయానికి తాళాలు
ABN , First Publish Date - 2020-03-27T10:57:19+05:30 IST
నిత్యం రద్దీగా ఉండే ఐటీడీఏ కార్యాలయం కరోనా కారణంగా అన్ని గేట్లకు తాళాలు వేశారు. ఇతరులు ఎవరూ
సీతంపేట, మార్చి 26: నిత్యం రద్దీగా ఉండే ఐటీడీఏ కార్యాలయం కరోనా కారణంగా అన్ని గేట్లకు తాళాలు వేశారు. ఇతరులు ఎవరూ కార్యాలయా నికి రాకుండా ఐటీడీఏ సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే కార్యాలయంలో నిర్వహించే స్పందన రద్దు చేయడంతో అర్జీదారులు రాకపో యినప్పటికీ ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా వస్తారనే భావనతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా అన్ని ప్రధాన గేట్లకు తాళాలు వేశారు. అత్యవసర సేవల సిబ్బంది మాత్రమే విధులకు అందుబాటులో ఉంటున్నారు.