చెన్నైలో లాక్‌డౌన్ సడలింపు: పళనిస్వామి

ABN , First Publish Date - 2020-07-05T23:28:34+05:30 IST

తమిళనాడులోని చెన్నై సహా పలు జిల్లాల్లో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి సడలిస్తున్నట్టు ముఖ్యమంత్రి ..

చెన్నైలో లాక్‌డౌన్ సడలింపు: పళనిస్వామి

చెన్నై: తమిళనాడులోని చెన్నై సహా పలు జిల్లాల్లో లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి సడలిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి ప్రకటించారు. నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలు 12 గంటల పాటు తెరచి ఉంచుతారని చెప్పారు. ఆదివారంనాడు మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిత్యావసరాలు, కూరగాయల దుకాణాలు తెరుచుకోవచ్చని, దుస్తుల దుకాణాలు, హార్డ్‌వేర్ దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 వరకూ, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 వరకూ తెరుస్తారని చెప్పారు.


కాగా, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 1,07,001కి చేరుకోగా, వాటిలో 60,592 మందికి స్వస్థత చేకూరింది. 8,671 మంది మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-07-05T23:28:34+05:30 IST