లాక్డౌన్లో ఏకంగా 3.3 కోట్ల ఫోన్లపై కెనడా ప్రభుత్వ నిఘా..!
ABN , First Publish Date - 2021-12-27T01:48:19+05:30 IST
లాక్డౌన్ సమయంలో కెనడా ప్రభుత్వం ఏకంగా 3.3 కోట్ల సెల్ఫోన్లపై నిఘా పెట్టినట్టు ఓ సంచలన నివేదిక బయటపడింది.
ఇంటర్నెట్ డెస్క్: లాక్డౌన్ సమయంలో కెనడా ప్రభుత్వం ఏకంగా 3.3 కోట్ల సెల్ఫోన్లపై నిఘా పెట్టినట్టు ఓ సంచలన నివేదిక బయటపడింది. ప్రజలు కరోనా నిబంధనలను ఏమేరకు పాటిస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు నిఘా పెట్టినట్టు సమాచారం. ఇది కెనడాలో పెను కలకలానికే దారితీసింది. కెనడాకు చెందిన ఆరోగ్యరంగ నియంత్రణ సంస్థ ఈ నిఘాకు పూనుకున్నట్టు సమాచారం. 9/11 దాడుల తరువాతి చూసిన నిఘా కంటే ఈ వ్యవహారం చాలా పెద్దది అని వారు అంటున్నారు. అక్కడి టెలికాం సంస్థ నుంచి ప్రభుత్వం ఈ సమాచారాన్ని తీసుకుందట. ప్రజల కదలికలు, కరోనా వ్యాప్తి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేసేందుకు మొబైల్స్పై నిఘా పెట్టినట్టు సమాచారం.